ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ ప్రభావం..ఇంటర్ పరీక్ష వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 10:03 PM

రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర తుపాన్ కారణంగా ఏపీలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. తీవ్ర తుపాను 'అసని' దిశ మార్చుకుని రాష్ట్రం వైపు వస్తుండడంతో ప్రభుత్వం రేపటి పరీక్షను వాయిదా వేసింది. ఇక రేపటి ఇంటర్ పరీక్షను మే 25న జరుపుతామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. 


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలను తాకుతూ పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని తొలుత అంచనా వేశారు. అయితే, అసని దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు మరలడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే రేపటి ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa