ఓ హిందూ దళిత కుటుంబం పాకిస్థాన్ నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్కు చేరుకుంది. పది మందితో కూడిన ఆ కుటుంబం పాకిస్థాన్లోని వేధింపులను తాళలేక నానా తంటాలు పడి భారత్కు చేరుకుంది. ఆ కుటుంబం పాక్ సింధ్ ప్రావిన్స్లోని మీర్పూర్ ఖాస్లో ఉండేది. అయితే ఆ కుటుంబంలోని హరీష్ అనే వ్యక్తిని పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో అతడు విడుదలయ్యాడు. కానీ కొందరు అతడిని కిడ్నాప్ చేసి.. డబ్బులు ఇవ్వాలని ఆ కుటుంబాన్ని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫ్యామిలీలోని మహిళలను రేప్ చేస్తామని బెదిరించారు. అయితే వారి దగ్గర డబ్బులు లేవని ధ్రువీకరించుకున్నాక అతడిని వదిలేశారు.
ఈ బాధలు తట్టుకోలేక ఆ కుటుంబ సభ్యులు పాకిస్థాన్ను వీడాలనుకున్నారు. రాజస్థాన్లోని బార్మర్లోని తమ చుట్టాల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు భారత వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దానిని అధికారులు తిరస్కరించారు. దాంతో ఆ కుటుంబం గత ఏడాది డిసెంబర్లో దుబాయ్ వెళ్లింది. అక్కడ నుంచి కూడా భారత వీసాకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆ కుటుంబం అక్కడ నుంచి నేపాల్కు వెళ్లింది. నిజానికి నేపాల్ నుంచి వీసా పొందడం సులభమని వారు భావించారు. కానీ అక్కడ నుంచి వీసా దొరకలేదు.
నేపాల్ నుంచి భారత్కు..
దాంతో ఆ కుటుంబ సభ్యులు నేపాల్లోని ఓ వ్యక్తి సాయంతో భారత్ సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు నడిచి భారతదేశంలో అడుగుపెట్టారు. అనంతరం ఎలాగోలా బార్మర్కు చేరుకున్నారు. అయితే ఇక్కడకు చేరుకున్నా వారి కష్టాలు తీరలేదు. ఆ కుటుంబం అక్కడ ఉండడం అక్రమని, ఇది తెలిస్తే వారిని అరెస్ట్ చేస్తారని స్థానికులు అన్నారు. దీంతో ఏప్రిల్ 23న స్థానిక విదేశీ కార్యాలయానికి వెళ్లారు. పాక్లో వేధింపులు తాళలేక అతి కష్టం మీద బార్మర్కు చేరుకున్నట్లు తెలిపారు.
పౌరసత్వం ఇవ్వాలని అభ్యర్థన ..
పాకిస్థాన్కు తిరిగి వెళ్లలేమని, తమకు వెంటనే వీసా, పౌరసత్వం ఇవ్వాలని ఆ కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. "వారు నా కొడుకును కిడ్నాప్ చేశారు, కూతుళ్లను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. అక్కడి నుంచి పారిపోవడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు" అని ఆ కుటుంబానికి చెందిన రాణి దేవి అన్నారు. అలాగే 1947లో విభజన సమయంలో తమ బాబాయ్ భారతదేశానికి వచ్చారని, కానీ మా తాత ఇక్కడకు రావడానికి ఇష్టపడకపోవడంతో తాము పాకిస్థాన్లోనే ఉండిపోయామని కుటుంబ సభ్యుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. ఈ కుటుంబానికి ఇప్పటికీ మీర్పూర్ పట్టణంలో భూమి ఉంది. దళిత మేఘవాల్ సామాజికవర్గానికి చెందిన కుటుంబం. రాజస్థాన్, గుజరాత్ పొరుగున ఉన్న పాకిస్థాన్లోని సింధ్లో దళిత హిందువుల జనాభా గణనీయంగా ఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa