ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకంగా రథమే కొట్టుకొచ్చింది...చూసేందుకు జనం ఎగబడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 02:37 AM

ఏపీలో ఓ ఆశ్చర్యకర ఘటన నెలకొంది. అసని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. భారీ అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. విదేశాలకు చెందిన, బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవు వద్దకు ఇది కొట్టుకొచ్చింది. ఈ రథంపై 16-1-2022 తో పాటు విదేశీభాష కనిపిస్తోంది. ఇది థాయిలాండ్ లేదా మలేషియా, లేదా జపాన్ దేశాలకు చెందినదై ఉండొచ్చని కొందరు మత్స్యకారులు చెపుతున్నారు. 


హుదూద్, తిత్లీ వంటి పెను తుపానులు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడూ కొట్టుకుని రాలేదు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రథాన్ని చూడ్డానికి స్థానికులు పోటెత్తారు. మరోవైపు దీన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa