బ్రెడ్, బిస్కట్, రోటీల ధరలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధమేమిటీ అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ లోతైన అద్యయనం చేస్తే తప్పా అసలు లోగుట్టు పసిగట్టవచ్చు. బ్రెడ్, బిస్కెట్, రోటీల ధరలు వచ్చే నెలల నుంచి పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్)ను ఇంకా ప్రకటించలేదు. ఓఎంఎస్ స్కీమ్ కింద రెగ్యులర్ బేసిస్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) గోధుమలను మార్కెట్లో విక్రయిస్తోంది. దీని ద్వారా సరఫరాను పెంచి, ఆహార ధాన్యాలు సమృద్ధిగా లభించేలా చేస్తుంది. గోధుమల లీన్ సీజన్లో ఓపెన్ మార్కెట్ ధరలను నియంత్రించేందుకు ఓఎంఎస్ఎస్ ను ప్రభుత్వం వాడుతోంది.
అయితే ఈ ఏడాది ఎఫ్సీఐ గోధుమల కోసం ఓఎంఎస్ఎస్ను ప్రకటించలేదు. దీంతో కన్జూమర్లు, కంపెనీలు వీటి ధరలు మరింత పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెంపు జూన్ నుంచి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. రుతుపవనాల కాలంలో స్నాక్స్ వంటి వాటికి డిమాండ్ ఉండటంతో...ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి గల కారణం రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయంలో విద్యా సంస్థలు కూడా ప్రారంభమవుతాయి. ఆ సమయంలో బ్రెడ్, బిస్కెట్ వంటి స్నాక్స్ ఐటమ్స్కు డిమాండ్ పెరుగుతుంది.
గత కొన్నేళ్లుగా ఎఫ్సీఐ గోధుమలపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వచ్చింది. సరఫరా ఎక్కువగా ఉండటంతో... డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కంపెనీలు కూడా బాగా లబ్ది పొందాయి. గతేడాది ప్రభుత్వం నుంచి గోధుమలు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ 70 లక్షల టన్నుల గోధుమలను సేకరించింది. ఇప్పటి వరకు ఓఎంఎస్ఎస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కంపెనీలు ధరలను పెంచనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa