17, 18వ తేదీ ఉదయం ఏడు గంటలకు గడప, గడపకు వైకాపా ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమ వుతుందని వైసీపీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉప సభాపతి కోన రఘుపతి నివాసం వద్దనుండి 9, 10, వార్డులలో మూర్తి రక్షణ నగర్ యాదవపాలెం , ప్యాడిసన్ పేటల్లో ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకొనుటకు , ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించుకునే దిశలో శాసన సభ్యులు కోన రఘుపతి బయలు దేరుతారు. కనుక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa