సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండల పరిధిలోని కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్ల కొత్తపల్లి గ్రామంలో గత రెండు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్తులు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి మీద బైఠాయించిరాస్తారోకో చేపట్టారు.గ్రామస్తులకు మద్దతుగా సిపిఐ పార్టీ నాయకులు మద్దతు తెలిపి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల సిపిఐ నాయకులు పూల శ్రీనివాసులు, చలపతి నాయుడు లు మాట్లాడుతూ గత రెండు నెలలుగా గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నా మని ప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని నీటి సమస్య పరిష్కరించేంత వరకు నిరసన విరమించేది లేదని బైఠాయించారు.
సిపిఐ పార్టీ నాయకులతో గ్రామస్తులతో ఎంపీడీవో శివరాం ప్రసాద్ రెడ్డి చర్చించి తక్షణమే నేటి నుండి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడతామని వారం లోపల బోరు మంజూరు కు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చినిరసనను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామ్మోహన్ నాయుడు రత్నాబాయి, గ్రామస్తులు లక్ష్మీదేవి, కళావతి, గంగులమ్మ, కమలమ్మ, రత్నమ్మ, శంకరమ్మ, కేశవ, సుబ్బరాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa