ఇటీవల కాలంలో కొందరి మహిళల తీరు వివాదాస్పదంగా మారుతోంది. పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు కొందరు మహిళలు పాల్పడుతున్నారు. పవిత్ర వివాహ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తూ, వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు. అవసరమైతే ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇలా ఓ మహిళ నిండా 18 ఏళ్లు లేని ఓ బాలుడిపై కన్నేసింది. అతడిని గదిలో బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. ఆలస్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముంబైలోని ధారావి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, బీహార్లోని ఓ బాలుడు (17)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అందులో కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్న తర్వాత, ఇద్దరూ తమ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. బాలుడి ఫోన్ నంబర్ దొరికిన తర్వాత ఆ మహిళ నిజస్వరూపం బయటపడింది. తన కోరిక తీర్చాలని తరచూ వేధిస్తుండడంతో, ఆమె నంబర్ను బాధిత బాలుడు బ్లాక్ చేశాడు. కొన్నాళ్లకు ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల వద్దకు సదరు బాలుడు చేరుకున్నాడు. అతడికి మాయమాటలు చెప్పిన ఆ మహిళ తన వద్దకు రప్పించుకుంది. తీరా వచ్చిన తర్వాత గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేసింది. అంతేకాకుండా నగరంలోని పలు హోటళ్లకు తిప్పుతూ తన కామవాంఛ తీర్చుకుంది. చివరికి ఆ మహిళ ఆగడాలను బాలుడు తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు తమ పిల్లాడిని రక్షించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే బాలుడితో పాటు అతడి తండ్రి, మేనమామ తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీసు కేసు పెట్టడం కొసమెరుపు. చివరికి ఫోన్ చాటింగ్ పరిశీలించిన తర్వాత సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa