భర్త బద్దకంగా ఉన్నాడని ఓ భార్య అతన్ని చంపి కూర వండేసిన ఘటన సెర్బియాలో చోటుచేసుకుంది. జ్రెంజనిన్కు చెందిన సర్జాన్ పెరిక్ (42) అతన్ని థెరెస్సా పెరిక్ (46) అనే ఆమె పెళ్లి చేసుకుంది. అయితే థెరెస్సాకు అంతకంటే ముందుగా నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. పెరిక్ ఆమెకు ఐదో భర్త కావడం విశేషం. నలుగురు భర్తకు విడాకులిచ్చాక సర్జాన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. థెరిస్సాకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఐదో భర్త అయిన సర్జాన్ తో మాత్రం ఇంత వరకూ పిల్లలు కలగలేదు. తనతో పెళ్లయ్యి రెండేళ్లు అవుతున్నా సర్జాన్ ఇంట్లోనే ఏ పనీ పాటా లేకుండా ఉండేవాడని థెరిస్సా పలుమార్లు గొడవకు దిగింది.
ఇరువురి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. భర్త బద్ధకంతో ఉండటాన్ని చూసి విసిగిపోయిన థెరిస్సా మే 10న రాత్రి సమయంలో భర్త సర్జాన్పై దాడి చేసి హత్య చేసింది. సర్జాన్ను థెరెస్సా చంపుతుండగా ఆమె కూతురు డి.ఎల్జే కళ్లారా చూసింది. భర్తను చంపిన తర్వాత సర్జాన్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని పెద్ద ప్యాన్లో ఉంచి థెరిస్సా కూర వండింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని థెరిస్సా చేసిన దారుణాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు థెరిస్సాను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa