కమలాపురం మండలం రామాపురం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. బెంగళూరు నుంచి తెచ్చిన అనేక రకాల పుష్పాలతో రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయ అలంకరణ చేశారు. విశాఖపట్నం నుంచి విచ్చేసిన వేదపండితులు సంతోష్ శర్మ బ్రహ్మోత్సవాలకు అవసరమైన పూజా ఏర్పాట్లను దగ్గరుండి చేస్తున్నారు. శనివారం ఉదయం గణపతిపూజ, స్వస్తి వాచనం, మూలవిరాట్ దేవతా మూర్తుల కలశస్థాపన, రుత్విక్ కరణం, గోపూజ, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట మహోత్సవం, పూజా సేవలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్యసాయినాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు గత నాలుగు రోజులుగా ఉత్సవాల నిర్వహణలో నిగ్నమై భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa