ఉత్తర కొరియాలో కరోనా కలకలం రేపుతోంది. కఠిన లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కరోనా కేసులు వెల్లువలా నమోదవుతున్నాయి. కరోనా ప్రవేశించిన మూడు రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,620కు చేరింది. కనీసం 324,550 వరకు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మహమ్మారితో పోరాడుతూ 15 మంది కన్నుమూశారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరింది.
రాజధాని ప్యాంగ్యాంగ్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసినట్లు ఉత్తర కొరియా గురువారం ధృవీకరించింది. దీంతో కిమ్ సర్కారు అప్రమత్తమై దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించింది. ప్రపంచాన్ని కుదేలు చేసిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో కరోనా ప్రతాపం చూపిస్తోంది. దేశంలోని అన్ని ప్రావిన్సులు, నగరాలు, కౌంటీలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇళ్లలో ఉంటున్న ప్రజలను బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa