ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేసేస్తారు

national |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 02:01 PM

ఒక్కోసారి సరిగ్గా చదవని కారణంగా పరీక్షల్లో విద్యార్థులు వింతగా జవాబులు రాస్తుంటారు. ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు వారు రాసిన సమాధానాలు నవ్వు రప్పిస్తుంటాయి. తమ బాధలన్నింటినీ ఏకరువు పెట్టేస్తుంటారు. ఇదే కోవలో ఓ విద్యార్థిని జవాబు పత్రంలో రాసిన విషయాలను నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హర్యానాలో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తయ్యాయి. ఇటీవల జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టారు. అందులో ఓ విద్యార్థిని రాసిన జవాబు పత్రం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. త‌న‌ తండ్రి మద్యానికి బానిస అయ్యాడని, నిత్యం తన సవతి తల్లి బాగా హింసిస్తోందని పేర్కొంది. ఆర్మీలో ఉద్యోగం సాధించడం తన లక్ష్యమని రాసింది. పరీక్షలకు తాను సరిగ్గా చదవలేకపోయానని, 75 శాతం మార్కులు రాకుంటే తన తండ్రి తనకు పెళ్లి చేసేస్తాడని వాపోయింది. జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులు తనను కూతురిలా భావించి మార్కులు వేయాలని కోరింది.

ఇది చూసిన ఉపాధ్యాయుడు నివ్వెరబోయాడు. ఇదే కాక విద్యార్థులు రాసిన మరికొన్ని కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదని, తాను ఏదో ఒకటి రాశానని, దానికే మార్కులు వేయాలని కోరాడు. మరికొందరు బెదిరింపులకు సైతం దిగుతున్నారు. పాస్ చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని సైతం కొందరు ఆన్సర్ షీట్‌లో రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa