2019 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన మానుకొండ జాహ్నవిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేయడమైంది అని నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. జాహ్నవి 2013లో నమోదైన గంజాయి కేసులో నిన్న అరెస్టు అయ్యారు. ఈ కేసులో తుదితీర్పు వచ్చి, నిజనిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. అప్పుడెప్పుడో నమోదైన కేసులో ఇప్పుడు అరెస్ట్ చెయ్యడం పట్ల చాల అనుమానాలున్నాయి అని అన్నారు. కేసు విచారణలో ఉండగా , నిజనిజాలు తెలియకుండానే అరెస్ట్ కి పాల్పడటం అనేది దారుణమన్నారు. ఐనప్పటికీ న్యాయస్థానాల మీద, రాజ్యాంగం మీద తమకు ఉన్న అపార గౌరవంతో , కేసు తుది తీర్పు వచ్చే వరకు పార్టీ నుండి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa