గుత్తి మండల పరిధిలోని వన్నేదొడ్డి గ్రామ సమీపంలోని 44 వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో షణ్ముఖ అను వ్యక్తి తోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa