జిల్లాలో పెద్దఎత్తున భూ అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, కొద్ది మంది నేతలు కలసి ప్రభుత్వ భూములను పెద్దఎత్తున కాజేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. జిల్లాలో పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, గార్లదిన్నె, శింగనమల ఇలా అనేక చోట్ల భూ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. పుట్లూరు లాంటి మండలాల్లో ఉన్న భూమి కంటే రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉందన్న విషయం అధికారుల విచారణలోనే తేటతెల్లమైందని గుర్తు చేశారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారులు భాగస్వామ్యులుగా ఉన్నారని వివరించారు. వీటిపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించి సమగ్రమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
విచారణ అనంతరం భూములకు సంబంధించిన వివరాలను మండల కార్యాలయాల వద్ద బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో అసైన్డు చేసినట్టు రికార్డుల్లోనున్న భూమి వివరాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో జూన్ నెలలో సిపిఎం తరుపున భూ అక్రమాలను బయటపెట్టి, ఈ భూములను భూమిలేని పేదలకు పంచిపడతామని చెప్పారు కావున అధికారులు భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్, జిల్లా నాయకులు సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa