తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో శ్రీలంక సర్కారు అత్యవసర పరిస్థితిని విధించడం తెలిసిందే. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మే 6 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీని విధించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులకు విశేష అధికారాలు కల్పించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు కొద్ది మేర మెరుగయ్యాయని, దేశంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక 'హిరు న్యూస్' మీడియా వెల్లడించింది. ప్రజలకు నిత్యావసరాలు కూడా అందించలేని దయనీయ స్థితిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండు వారాలుగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నేడు ప్రకటించింది. ఇదిలావుంటే శ్రీలంకలో ఇప్పటివరకు చోటుచేసుకున్న అల్లర్లలో 9 మంది మరణించగా, 200 మంది వరకు గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa