సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజక్కేయ రంగ ప్రవేశం చేసి చాల సంవత్సరాలు ఐనప్పటికీ ఆయన రాజకీయాలలో తన మార్కు చూపలేకపోయారనే చెప్పాలి. ఐనప్పటికీ, నాకు పదవుల కన్నా ప్రజా క్షేమమే ముఖ్యం అనే నినాదంతో సరికొత్త రాజకీయాలకి తెర తీశారు. ఈ సందర్భంలో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతులని పరామర్శించి వారికీ లక్ష చొప్పున ఆర్థిక సాయం చెయ్యాలి అని కంకణం కట్టుకొని రైతు భరోసా యాత్ర పేరుతో రాష్ట్రమంతటా తిరుగుతున్నాడు. దేనితో జనసేన గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలి. కొంతమంది ధనికులు కూడా ఈ కార్యక్రమం నచ్చిన వారు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.... ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసాయాత్రకు తమవంతుగా తాళ్లూరి రామ్ ఆధ్వర్యంలో కెనడా జనసేన టీమ్ తరపున 5,55,555 రూపాయల చెక్కును అడపా విజయ్ బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa