కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్ జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ దయాదాక్షిణ్యాలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్రెడ్డి మోదీకి దత్తపుత్రుడు అనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో సీపీఐ కార్యాలయంలో నారాయణ మాట్లాడుతూ.. .దేశంలో నానాటికీ నిరుద్యోగం పెరిగిపోయి యువతకు ఉపాధి అవకాశాలు దక్కటం లేదని నారాయణ ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశన్ని అంటడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ త్వరలో జాతీయ స్థాయిలో అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఇక, వైసీపీ పాలనలో అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం జగన్ సింహం సింగిల్గా వస్తారంటారని.. కానీ, వేలాది మంది పోలీసుల రక్షణ లేనిదే సీఎం కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసుల సహకారంతో ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa