ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కేంద్ర స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 08:50 PM

సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఖాతాదార్లకు కేంద్రం ఓ సందేశం పంపింది. మీ మొబైల్ ఫోన్లకు ఎస్భీఐ పేరుతో వచ్చే మెసేజ్ లకు స్పందించి మోసపోకండి అని సూచించింది.ఇటీవల ఫోన్లకు ఓ సందేశం వస్తోంది. మీ ఎస్ బీఐ ఖాతా బ్లాక్ చేయబడింది... సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోండి అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ తో పాటే ఓ లింకు కూడా దర్శనమిస్తోంది. అయితే ఇది ఫేక్ మెసేజ్ అని, దీంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇది నకిలీ మెసేజ్ అని స్పష్టం చేసింది. 


ఎస్ బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని, ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్ కు ఈ తరహా సందేశాలు వస్తే అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్ పై ఎవరైనా ఎస్ బీఐ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa