వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం దావోస్ చేరుకున్నారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 52వ వార్షిక సమావేశం మే 22-26 తేదీల్లో జరగనుంది. రెండేళ్ల తర్వాత జరిగే వార్షిక సమావేశానికి 50 మందికి పైగా ప్రభుత్వాధినేతలు మరియు 1,250 మంది ప్రైవేట్ రంగానికి చెందిన వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ ష్వాబ్తో సీఎం జగన్ సమావేశమయ్యారు.ఏపీకి పెట్టుబడులు, టెక్నాలజీని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ వెళ్లారు.డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్తో ఆయన సమావేశమయ్యారు.ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని, పరిశ్రమలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa