ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ ధరలకు భయపడి...బస్సు గూడ్స్ ఎక్కింది

national |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:42 PM

పెట్రోల్ ధరలు చూస్తే ఇంకా సామాన్యుడికే కాదు ఉన్నత వర్గాలకు కూడా దడపుడుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా తయారైన బస్సులను రోడ్డుమార్గంలో కాకుండా గూడ్స్ రైళ్లలో తరలిస్తున్నారు. మనం సహజంగా గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు తరలించడం చూస్తుంటాం అప్పుడప్పుడు.  అయితే దేశంలో తొలిసారిగా ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో రవాణా చేశారు. బెంగళూరు నుంచి చండీగఢ్ కు ఈ బస్సులను తరలించారు. ఈ బస్సులు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినవి. మొత్తం 300 బస్సులను రైలు మార్గం ద్వారా రవాణా చేశారు. 


ఈ బస్సులు బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే ఎంతో వ్యయం అవుతుంది. దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రైలు మార్గం ద్వారా చాలా చవకగా రవాణా చేయవచ్చని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులను రైల్లో తరలించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa