పామర్రు నియోజకవర్గం పరిధిలోని ఆలయాల్లో హనుమజ్జయంతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉండ్రపూడి - పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవా లయంలో విశేష పూజలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి సలాది వెంకట సుబ్బారావు తెలిపారు. స్థానిక ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఉదయం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, 6 నుంచి 10 గంటల వరకు భక్తులకు సాధారణ దర్శనం, లక్ష నాగవల్లి పత్రాలు, లక్ష తమలపాకులతో విశేషంగా పూజ నిర్వహిస్తామన్నారు. అనంతరం అన్న సమారా ధన, సాయంత్రం 6గంటలకు శ్రీ సువర్చలా ఆంజనే యస్వామి వార్లకు శాంతి కల్యాణోత్సవం జరుగుతుం దన్నారు. వేడుకలకు ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మట్టా పూర్ణ చంద్రరావు, మండలి సభ్యులు ఆధ్వర్యంలో కార్యక్ర మాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa