ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 31న లబ్ధిదారులతో ప్రధానమంత్రి ముఖాముఖి

national |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 10:28 AM

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న జిల్లాకు చెందిన లబ్ధిదారులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్య కార్యదర్శి మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కేంద్ర పథకాలపై ప్రధాని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉదయం 9. 45 నుంచి మధ్యాహ్నం 12. 10 వరకు ముఖాముఖిలో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను ఈ నెల 26లోగా గుర్తించి నివేదిక సమర్పిస్తామని ముఖ్య కార్యదర్శికి జేసీ వెంకటేశ్వర్‌ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa