కోనసీమ జిల్లా పేరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. అన్యం సాయి అనే వ్యక్తి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఫొటోలు దిగారని విశ్వరూప్ మంత్రి అయిన సమయంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కట్టారని నిన్న అమలాపురంలో జరిగిన దాడుల్లో అతనే ప్రధాన వ్యక్తి అని ఆయన అన్నారు. సాయి వైసీపీ నాయకుడని చాలా మంది మాట్లాడుకుంటున్నారని తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తి సీఎం అయినప్పుడు అదే విధంగా ఎక్కువ మంది కోరిక మేరకు కోనసీమ జిల్లాపై ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. జిల్లాల పేర్ల మీద గతంలో కూడా వివాదాలు రేగాయని చాలా చోట్ల ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారని చెప్పారు. కోనసీమ జిల్లా పేరుపై కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. అంబేద్కర్ ను అభిమానించని వ్యక్తి ఏ కులంలో కూడా ఉండరని.. అన్ని కులాల వారు ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. జిల్లా పేరు విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మంది ప్రజలు సమర్థిస్తున్నారనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని నిర్వహించాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa