కాపురంలో కలహాలు సహజం. అయితే మనస్పర్ధలు తలెత్తినప్పుడు కూర్చుని చర్చించుకోవాల్సింది పోయి కొందరు ఆవేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. చిన్న కారణాలకే తమ జీవిత భాగస్వామిని హత్య చేస్తున్నారు. ఇదే కోవలో ఓ భర్త అమానుష చర్యకు పాల్పడ్డాడు. వంట ఆలస్యమైందని భార్య ప్రాణం తీశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ ప్రాంతంలోని తిల్యాఖేదీలో దినేశ్ మాలి, యశోద అనే భార్యాభర్తలు నివాసముంటున్నారు. వారికి ఓ అమ్మాయి కూడా ఉంది. పని నుంచి ఇంటికి బుధవారం సాయంత్రం తిరిగి వచ్చాడు. ఆకలి వేస్తోందని, భోజనం పెట్టాలని భార్యకు చెప్పాడు. వంట ఇంకా పూర్తి కాలేదని, కాసేపు ఆగాలని భార్య యశోద జవాబిచ్చింది. ఇంటి పనులే ఇంకా పూర్తి కాలేదని, భోజనానికి సమయం పడుతుందని చెప్పింది. భార్య సమాధానంతో దినేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
భార్య జుట్టు పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని చావగొడుతుంటే కుమార్తె అడ్డు వెళ్లింది. ఆమెను కూడా దెబ్బలు వేశాడు. అంతటితో ఆగకుండా తన దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయిన భార్యను ఇంటి పెరట్లో ఉన్న బావిలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. వారి కుమార్తె ఇచ్చిన సమాచారంతో బంధువులు అక్కడకు చేరుకుని యశోదను బయటకు తీశారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దినేశ్ కోసం గాలింపు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa