ఒకే కుటుంబంలో నలుగురు మరణించిన ఘటన చైన్నా లో నెలకొంది. వారిలో ముగ్గరిది హత్య కాగా ఒకరిది ఆత్మహత్య అయివుండొచ్చని పోలీసులు అనుమానంవ్యక్తంచేస్తున్నారు. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు వెలుగు చూడడం చెన్నై నగర శివార్లలో తీవ్ర కలకలం రేపింది. పోళిచాలూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ మృతదేహాలు ఉన్నట్టు ఈ ఉదయం వెల్లడైంది. వాటిని ఓ పురుషుడు, స్త్రీ, ఇద్దరు పిల్లల శవాలుగా గుర్తించారు. ఆ కుటుంబ యజమాని మొదట తన భార్యను చంపి, ఆపై పిల్లలను కడతేర్చి, చివరగా తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యాపారంలో నష్టపోయి, ఆర్థికపరమైన సమస్యలతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోళిచాలూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa