టీడీపీకి ఆ పార్టీ నాయకురాలు దివ్యవాణి రాజీనామా చేశారు. దీంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల జరిగిన ‘మహానాడు’ గ్రాండ్ సక్సెస్ అయిన ఆనందంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్వవాణి ప్రకటించారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యవాణి మంగళవారం అనూహ్యంగా ట్విట్టర్ వేదికగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు దేశంలోని కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి వెల్లడించారు. ఇంత వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ‘మహానాడు’లో తనకు ఘోర అవమానం జరిగిందని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి సోమవారం ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. టీడీపీకి తాను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక కళాకారుడు (దివంగత ఎన్టీ రామారావు) పెట్టిన పార్టీలో.. కళాకారులకు స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తోందని దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మంగళవారం అనూహ్యంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే, టీడీపీకి రాజీనామా తర్వాత, ఆమె మాటలను బట్టి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa