ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జగన్ సాయంత్రం 4.30 గంటలకు మోదీని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు. అలాగే త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.మోడీతో భేటీ ముగిసిన అనంతరం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. నిర్మలతో భేటీ అనంతరం జగన్నాథ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాత్రి 9 గంట ల త ర్వాత జ గ న్ తో అమిత్ షా భేటీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa