ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధూ హత్య ఎఫెక్ట్...కొందరి భద్రతను పునరుద్దరిస్తున్న సర్కార్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:38 AM

ప్రముఖ గాయకుడు సిద్దూ  మూసేవాలా హ‍త్య నేపథ్యంలో  ఉల్లిక్కిపడ్డ  పంజాబ్ సర్కార్ గతంలో తాను తీసుకొన్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. పలువురికి తిరిగి భద్రతను  పునరుద్దరించింది. ఇదిలావుంటే ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్య సంచలనం సృష్టించింది. పంజాబ్ ప్రభుత్వం 424 మందికి భద్రత తొలగించగా, వారిలో సిద్ధూ మూసేవాలా కూడా ఒకరు. భద్రత తొలగించిన మరుసటి రోజే సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో, ఇటీవల భద్రత తొలగించిన 420 మందికి పైగా వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వం భద్రత పునరుద్ధరించనుంది. జూన్ 7 నుంచి భద్రత పునరుద్ధరణ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 


424 మందికి భద్రత తొలగించడంపై మాజీ మంత్రి ఓపీ సోనీ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా, తొలగించిన భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇదిలావుంటే జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ (1984 నాటి సైనిక చర్య) నిర్వహించిన రోజు కావడంతో భద్రతా సిబ్బంది అవసరమైనందునే, వీవీఐపీల భద్రతను కుదించామని వివరించింది. జూన్ 7 నుంచి పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa