ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీఐ ద్వారా...ఒక మే నెలలోనే రూ.10 లక్షల కోట్ల లావాదేవీలు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:40 AM

యూపీఐ సేవలను దేశ ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో ఈ లెక్కలను బట్టి చూస్తే ఇట్టే అర్థమైపోతోంది.భారత్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)  వ్యవస్థ తీసుకువచ్చిన తర్వాత తొలిసారిగా మే నెలలో అత్యధిక లావాదేవీలు చోటుచేసుకున్నాయి. దేశంలో 2016 నుంచి యూపీఐ అమల్లోకి వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఆన్ లైన్ చెల్లింపులు, ఇతర లావాదేవీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 


ఈ నేపథ్యంలో, మే నెలలో 595 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ రూ.10 లక్షల కోట్లు కావడం విశేషం. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఈ స్థాయిలో లావాదేవీలు జరగడం యూపీఐ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. అంతకుముందు, ఏప్రిల్ నెలలోనూ గణనీయ స్థాయిలో 558 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు జరిగినట్టు ఎన్పీసీఐ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa