ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేం వస్తే అమరావతిలోనే రాజధాని: సోము వీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:54 AM

ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని కడతామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. రాజధాని పనులను మూడేళ్లలో పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి అంశం, నిర్మాణ పనులకు సంబంధించి ఫైల్‌పైనే మొదటి సంతకం చేస్తామన్నారు. బీజేపీ అమరావతిలోనే రాజధాని కడుతుందని హామీ ఇచ్చారు. బీజేపీవి రత్నాలు వైఎస్సార్‌సీపీవి కేవలం నవరత్నాలు మాత్రమే అన్నారు. రాజధాని నిర్మాణ పనుల్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.


ఒకాయన ఎక్కడికెళ్లినా ఆ మోడల్ కేపిటల్ కడతానంటారు.. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిని విశాఖకు తీసుకెళ్తానంటాడు ఇంకొకాయన అంటూ చంద్రబాబు, సీఎం జగన్‌లను సోము ఎద్దేవా చేశారు. బీజేపీ అమరావతిలోనే రాజధాని కడుతుందని.. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మోడీ అభివృద్ధి విధానమేనని, దీనిపై ఏ పార్టీతోనైనా తాను చర్చకు సిద్ధమన్నారు.


డ్రైవర్లను చంపేస్తారు.. అధికారులను చెంపదెబ్బ కొడతారు.. అలాంటి వాళ్ళకు 151 సీట్లా అంటూ సోము విమర్శించారు. బీజేపీవి వంద రత్నాలు.. వాళ్ళవి నవరత్నాలు. దమ్ముంటే పోలవరంపై ఏ రాజకీయ నాయకుడైనా తమతో చర్చించవచ్చని సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ అరాచకాలకు బీజేవైఎం అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.


కూతురు, కొడుకు, మేనల్లుడు పాలన పోతుందని మోడీని దింపేస్తారా కేసీఆర్..? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఒకాయన కొడుకు సన్నబడ్డాడు.. ఆయన కూడా ఏదో మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. బీజేపీ సిద్ధాంత పరమైన పార్టీ, రాజకీయం చాలా పార్టీలకి వ్యాపారం, రాష్ట్రాలన్నిటిని అనుసంధానం చేస్తున్నది బీజేపీనే అని వ్యాఖ్యానించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ఉండాలి.. బాబర్ కట్టడం ఉండకూడదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa