ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా ప్రజలకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:07 PM

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. తుఫాన్, అల్పపీడనం సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ ఎండలు అదరగొడుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగనుంది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు.


విజయవాడ, కృష్ణా,ఏలూరు, రాజమండ్రి పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లలో 40-42 డిగ్రీలకు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. చిన్న పిల్లలు, గర్భిణిలు, పెద్ద వయసు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ తాగడం మంచిదని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa