సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యల పై కమిషనర్ కి అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa