ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 09:52 AM

లాడ్జీలో పేకాట ఆడుతున్న అరుగురితో పాటు ఇద్దరు నిర్వాహకులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం. రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ సమీపంలోని పంచవటి రెసిడెన్సీ రూమ్ 304లో కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై శివశంకర్ నేతృత్వంలో పోలీసులు బృందం దాడులు నిర్వహించగా ఆరుగురు పేకాట ఆడుతు న్నట్లు గుర్తించారు. అన్నానగర్కు చెందిన చేవెళ్లశ్రీకాంత్, అనిక శ్రీనివాస్, అల్లాడి పెంటయ్యన గర్కు చెందిన రాపాక లక్ష్మణ్, ఉప్పల్ కల్యాణపురికి చెందిన అరుకొండ శరత్, బోడుప్పుల్ బీమ్డ్డి నగర్కు చెందిన ఆరేపల్లి వినోద్ కుమార్, లంగర్ హౌజ్కు చెందిన బూర రాఘవేందర్ ను అదుపు లోకి తీసుకున్నారు. వీరి నుంచి పేక ముక్కలతో పాటు రూ. 19, 520 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద డబ్బులు తీసుకుని పేకాటకు అనుమతించిన లాడ్జీ మేనేజర్ మహేశ్, రూమ్ బాయ్ మహేశ్ కురవలను కూడా అదుపులోకి తీసు కున్నారు. లాడ్జి మరో మేనేజర్ శ్రీనివాస్, లాడ్జీ ఓనర్ దేవేందర్ పరారీలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa