ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో నేడువై. ఎస్. ఆర్. యంత్ర సేవా పథకం ప్రారంభం. జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 10:25 AM

శ్రీ సత్య సాయి జిల్లాలో నేడు వై. ఎస్. ఆర్. యంత్ర సేవా పథకం ప్రారంభమవుతుందని కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో 137 సి హెచ్ సిగ్రూపులకు వైయస్సార్ యంత్ర సేవాపథకం ద్వారా రూ. 15. 85 కోట్ల విలువగల వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నట్లు తెలిపారు.ఈ నెల 7 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నుండి డా. వై. ఎస్. ఆర్. యంత్ర సేవా పథకం  ప్రారంభించానున్నారని, జిల్లాలో స్థానిక బీడు పల్లి రోడ్డున ఉన్న సంస్కృతీ ఇంజనీరింగ్ కళాశాల  మైదానం లో వై. ఎస్. ఆర్. యంత్ర సేవా పథకం మెగా మేళా నిర్వహించి 118ట్రాక్టర్ లు,   వరి కోత యంత్రాలు, 228 వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను అందించనున్నట్లు తెలిపారు.రైతు భరోసా కేంద్రం పరిధిలోని పెద్ద, సన్న, చిన్న కారు రైతులందరూ వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ ధరల అద్దె కు తీసుకోవచ్చని, ట్రాక్టర్ లు, నాగళ్ళు , రోటో వెటర్లు, స్ప్రేయర్లు, వరి కోత యంత్రాలు వంటివి జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.   రైతు గ్రూపులకు జిల్లాలో రాయితీ 4. 23 కోట్లుకల్పించనున్నామని తెలిపారు. నేడు పంపిణీ కానున్న ట్రాక్టర్ల వివరాలు.


ధర్మవరంలో16 ట్రాక్టర్ లు, 39 వ్యవసాయ పనిముట్లు, హిందూపురంకు10ట్రాక్టర్లు,  22వ్యవసాయ పనిముట్లు, కదిరి కి 32 ట్రాక్టర్లు, 56వ్యవసాయపనిముట్లుమడకశిర కు 5ట్రాక్టర్ లు, 10 వ్యవసాయ పనిముట్లు పెనుగొండకు 20 ట్రాక్టర్ లు, 29 వ్యవసాయపనిముట్లుపుట్టపర్తి కి 24ట్రాక్టర్ లు, 62వ్యవసాయ పనిముట్లు రాప్తాడుకు11ట్రాక్టర్ లు, 16 వ్యవసాయ పనిముట్లు, మంజూరు అయ్యాయని తెలిపారు.


నేడుఉదయం 10. 30 గంటల నుండి కార్యక్రమంప్రారంభమవుథతుందని, ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొంటారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa