ఇదేమి వాతావరణం రా బాబూ. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వాతావరణం చల్లగా మారగానే హమ్మయ్య ఎండలు తగ్గాయి. వర్షాలు పడతాయి. అనుకుంటే మంగళవారం నుండి మళ్లీ పరిస్థితి మాములే. రాష్ట్రంలో భానుడు భగభగమంటూన్నాడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత లతోపాటు వేడి గాలులు సెగలు పుట్టిస్తున్నాయి. రోజురోజుకీ ఎండలు బాగా పెరిగిపోతుండడంతో వృద్ధులు, మహిళలు , చిన్న పిల్లల ఆరోగ్యం పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రధాన పట్టణాల్లోని రహదారులు జన సంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. రానున్న మూడు రోజులు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగనుందని వడగాల్పులు వీస్తాయని ప్రకటించడంతో పలువురు బయటకు వెళ్ళటానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో ముఖ్యమైన పని ఉంటే తప్పా బయట ఉదయం రావడానికి ఎవరూ సాహసించడం లేదు. ఎండలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి. వర్షాలు ఎప్పుడు ప్రారంభమయ్యి వాతావరణం చల్లబడుతుంది అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa