ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనం కేసులో ఓవ్యక్తి అరెస్ట్ రూ.6.7 లక్షల నగదు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 02:19 PM

విజయనగరం జిల్లా కేంద్రంలోని వసంత విహార్లో శ్రీలక్ష్మి పౌల్ట్రీ ఆఫీసులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంచార్జి డిఎస్పీ త్రినాధ్ వివరాలు వెల్లడించారు. జూన్4న రాత్రి శ్రీలక్ష్మి పౌల్ట్రీ కార్యాలయంలో బీరువా తాళాలు పగులగొట్టి రూ. 6. 8 లక్షలు నగదును దొంగిలించుకుపోయారు. ఒకటవ పట్టణ పోలీసులు 24 గంటల వ్యవధిలో చోరికి పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి రూ. 6. 7 లక్షల నగదు రికవరీ చేసి, రిమాండుకు తరలించామని ఇంచార్జి డిఎస్పీ శ్రీ టి. త్రినాథ్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన సిఐ జే. మురళి, ఎస్ఐ అశోక్, హెచ్ సి అచ్చిరాజు, కానిస్టేబుల్ శివకుమార్ లను అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతులను డిఎస్పీ అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa