ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూమ్ మీటింగ్ లోకి వస్తే మ్యూట్ చేసావ్..... డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా : విజ‌య‌సాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 09:18 PM

పదో తరగతి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులతో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో జూమ్‌ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్‌ మీటింగ్‌కు దిగడంపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనితోఎమ్మెల్యేలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసి.నేరుగా తనతో చర్చకు రావాలని సవాల్ చేసారు.ఈ విషయంపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి  స్పందించారు. జూమ్ మీటింగ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా అని విజ‌య‌సాయిరెడ్డి  ట్విట్ చేసారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa