ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ బ్యాట్రీ దేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరును బ్యాట్రీ స్టోరీగా నామకరణం చేసింది. లక్ష కిలోమీటర్ల వరకు ఈ వెహికిల్ను టెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలలో విపరీతంగా మంటలు చెలరేగుతుండటంతో.. లక్ష కి.మీల వరకు ముందుగానే టెస్ట్ చేసి, మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ స్కూటర్ సేఫ్టీపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేసింది.
తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఎక్కువ దూరం వెళ్లేందుకు వీలుగా ఈ స్కూటర్ను రూపొందించింది. అంటే ఈ స్కూటర్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 132 కి.మీలు ప్రయాణించి రాగలదు. ఓలా ఎలక్ట్రిక్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీని ఇవ్వగలదు. బ్యాట్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కంపెనీ ఎక్స్షోరూంలో రూ.89,600గా నిర్ణయించింది. రాష్ట్రాలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్పై ఎక్కువ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. దీంతో ఈ స్కూటర్ తక్కువ ధరకే లభిస్తుంది.
కొత్తగా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటల్ ప్యానల్ను కలిగి ఉంది. ఐదు రైడింగ్ విధానాలలో ఇది మార్కెట్లోకి వచ్చింది. ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, రివర్స్,పార్కింగ్ విధానాలలో ఇది అందుబాటులో ఉంది. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, ఈ బ్యాట్రీ స్టోరీ స్కూటర్ గంటకు 65 కి.మీల టాప్ స్పీడ్లో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ ఏఐఎస్ 156 ఆమోదించిన 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రూపొందింది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్తో ఇంటిగ్రేటెడ్ స్పాడ్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ను కంపెనీ రూపొందించింది. అంతేకాక బండి నడిపే సమయంలో మొబైల్కి ఏదైనా కాల్ వస్తే, ఈ స్కూటర్ అలర్ట్ చేసే స్పెషల్ ఫీచర్ను కూడా ఆఫర్ చేస్తోంది. దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్లను వెతుకునేందుకు సాయపడేలా కనెక్టెడ్ డ్రైవ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa