ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సకాలంలో తేరుకొన్నారు..ప్రాణాలు దక్కించుకొన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 10:01 PM

అకస్మిక ప్రమాదాల నుంచి బయటపడటం అంటే  సామాన్యమైన విషయం కాదు.  ఊహించని అగ్ని ప్రమాదంను వెంటనే  పసిగట్టిన ఓ కుటుంబం అందులోనుంచి చాకచక్యంగా బయటపడింది. నెల్లూరు జిల్లాలో కదులుతున్న కారులో మంటలు కలకలంరేపాయి. ఉలవపాడు జాతీయ రహదారిపై ఒక్కసారిగా కారులో మంటలు మొదలయ్యాయి. ఆ కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు సకాలంలో వెంటనే అప్రమత్తమై బయటికి దిగటంతో ప్రమాదం తప్పింది. ఈ కుటుంబం గుంటూరు నుంచి బెంగళూరు వెళుతుండగా మన్నేటికోట అడ్డ రోడ్డు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa