మంత్రాలయం జగన్మోహన్ రెడ్డి విభజన హామీలను కేంద్రం నుండి సాధించే దిశగా పని చేయాలని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి కోరారు. మంగళవారం పెద్దకడబూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొని కేంద్రంలో బీజేపీ సర్కార్ కు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మద్దతు తప్పనిసరిగా అవసరమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విభజన హామీల అమలుకు పోరాడుతామని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల గడిచినా ఒక్క విభజన హామీని కూడా సాధించి పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొనైనా విభజన హామీలను సాధిస్తారా లేదా స్వప్రయోజనం కోసం బీజేపీతో చేతులు కలుపుతారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa