ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ తీరుపై మహారాష్ట్రలో దుమారం...అజిత్ పవార్ ను మాట్లాడనివ్వకపోవడం ఏమిటీ

national |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 05:01 PM

మహారాష్ట్రంలో బీజేపీ, ఎన్సీపీ పార్టీల మధ్య మళ్లీ వార్ ప్రారంభమైంబది. మహారాష్ట్రలో నిన్న పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూణె జిల్లాలోని దెహూలో తుకారం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను, బీజేపీ నేత ఫడ్నవీస్‌ను మాట్లాడేందుకు అనుమతించి.. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను అనుమతించకపోవడం రాజకీయ రచ్చకు కారణమైంది. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇచ్చి, ఉప ముఖ్యమంత్రే కాకుండా పూణె జిల్లాకు చెందిన మంత్రి అజిత్ పవార్‌ను మాట్లాడనివ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


ఇదే విషయమై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా స్పందించారు. ఇది అజిత్ పవార్‌ ఒక్కరికే జరిగిన అవమానం కాదని, యావత్ మహారాష్ట్రకు జరిగిన అవమానమని అన్నారు. అమరావతిలోని అంబాదేవి ఆలయాన్ని నిన్న సందర్శించిన సుప్రియ.. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సమక్షంలో మాట్లాడేందుకు అనుమతివ్వాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) అజిత్ పవార్ కోరినా అంగీకరించలేదన్నారు. పూణె జిల్లాకు చెందిన అజిత్‌ను అదే జిల్లాలో వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ విషయంలో అది వారి ఇష్టమని, కానీ అజిత్ పవార్ విషయంలో అలా చేయడాన్ని సమర్థించలేమని సుప్రియా సూలే అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa