ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్న తరుణంలోప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. జులై 4న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఆయన రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్ను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మోదీ వెంట కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కూడా ఏపీకి రానున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్రం నుంచి ప్రకటన విడుదలైంది.
ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలోనే ఇటీవలే రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. అంతేకాకుండా ఆసుపత్రి నిర్మాణం మొత్తాన్ని ఆమె నిశితంగా పరిశీలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే మోదీ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa