సోషల్ మీడియా వచ్చేశాక ఏ సమాచారమైనా ప్రజల్లోకి వెంటనే వెళ్లిపోతోంది. అందుకే సద్దుద్దేశంతోనే కాదు దురుద్దేశంతోనే కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఇదిలావుంటే టీడీపీకి ఫేక్ల బాధ తప్పడం లేదు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ ప్రెస్నోట్ల పేరుతో హడావిడి నడుస్తోంది.. తీరా ఆరా తీస్తే అవి ఫేక్ అని తేలుతోంది. తాజాగా మరో ఫేక్ ప్రెస్నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల జగన్ సర్కార్పై విమర్శలు చేసిన గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన వెంకాయమ్మ పేరుతో.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఈ నోట్ ప్రచారంలో ఉంది. టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో మొదటి అభ్యర్థి ప్రకటన అనేది సారాంశం. ఆ ప్రెస్నోట్లో.. ‘తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్న అందరికి కృతజ్ఞతలు. ఇదే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు,యువతకు పెద్దపీట వేస్తూ మొదటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతో కష్టపడుతూ అందరికి స్ఫూర్తి ప్రధాతగా నిలబది పొరాటతత్వాన్ని కనబరచిన కర్లంపూడి వెంకాయమ్మ గారిని గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దళిత పోరాట యోధురాలు కర్లంపూడి వెంకాయమ్మ గారిని ప్రకటిస్తూ ఉన్నాము’అని ఉంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ప్రెస్నోట్ గురించి ఆరా తీస్తే.. అది నకిలీదిగా తేలింది. దీంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. టీడీపీని టార్గెట్ చేస్తూ కొద్దిరోజులుగా ఇలా ఫేక్ ప్రెస్నోట్లతో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు గతంలో కూడా కొన్ని ఫేక్ నోట్లు వైరల్ అయ్యాయి. అలాగే రెండు రోజుల క్రితం వైఎస్ విజయమ్మ పేరుతో కూడా ఓ నకిలీ ప్రెస్ నోట్ వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa