వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నాటి నుంచి జరిగిన రెండు జనరల్ ఎన్నికల్లోనూ ఆత్మకూరు ప్రజలు మన పార్టీ పక్షాన నిలిచారు. 2014, 2019 ఈ రెండు ఎన్నికల్లోనూ, మన పార్టీ అభ్యర్థి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నే గెలిపించారు. 2019లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వాటి నుంచి ఈ నియోజకవర్గంలోని ఇంటింటికీ మేలు చేసే పాలన అందిస్తున్నారు. నవరత్నాలు కానివ్వండి. ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి... ప్రతి ఒక్కటి అందరికీ అందిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ మూడేళ్లలో సీసీ రోడ్లు, సీసీ కాల్వలు, అంతర్గత రహదారులు, నీటి సరఫరా, కల్వర్టులు, ప్రజోపయోగ భవనాలు, అర్చీలు వంటి వాటి నిర్మాణాలకు, విద్యుదీకరణ పనులు, నగర సుందరీకరణకు, ఇతర అభివృద్ధి పనులకు మొత్తంగా రూ.173 కోట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. వైయస్ జగన్ చేసిన అభివృద్ధిని విజ్ఞులైన ఆత్మకూరు ప్రజల ముందు ఉంది. ప్యాన్ గుర్తు మీద ఓటు వేసి, మేకపాటి విక్రమ్ రెడ్డి కి అఖండ విజయం చేకూర్చాలని వైయస్ఆర్సీపీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa