వ్యాపారం కోసంం అడ్డదారులు తొక్కుతున్న రోజులివి. పాకిస్తాన్ కు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని అదే తరహాలో వ్యవహరించాడు. మెన్స్ మండే పేరుతో కరాచీలోని ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది. మగవారికి బిల్లులో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ప్రకటనలో ’‘ఆజా నా రాజా - దేనికోసం ఎదురు చూస్తున్నావు?. ఆజావో.. మెన్స్ మండే రోజు 25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకో’’ అన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. నీవు పెట్టిన సీన్, ఇస్తున్న ఆఫర్ స్త్రీ ద్వేషాన్ని, నీ అజ్ఞానానికి నిదర్శనం’’ అని ఓ యూజర్ మండిపడ్డాడు. (వీడియో కోసం)
గుంగూబాయ్ కతియావాడి గుర్తుందా..? అలియాభట్ ఓ వేశ్య నుంచి వేశ్యా కేంద్రం నిర్వాహకురాలిగా ఎదిగే పాత్రతో విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమాలో విటులను అలియాభట్ చేతితో సైగ చేస్తూ ఆహ్వానం పలికే సీన్ ఉంటుంది. సరిగ్గా ఇదే సీన్ ను పోస్టర్ గా ముద్రించి తన రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు ఓ పాకిస్థానీ.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై చాలా మంది పాకిస్థాన్ రెస్టారెంట్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అలియాభట్ పోస్టర్ ను వాడుకుంటూ రెస్టారెంట్ కు వచ్చే మగవారికి డిస్కౌంట్లు ప్రకటించడమే వివాదానికి దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa