డిపాజిట్ కోల్పోతారనే భయంతో బీజేపీ నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తోందని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు అవాస్తవాలతో కూడిన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆత్మకూరు అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని మంత్రి కాకాణి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు అనడం బాధాకరమన్నారు. నెల్లూరు జిల్లాలో 40 వేల నుంచి 45 వేల ఎకరాలు వరి సాగు చేస్తున్నారని, 15,800 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఎక్కడా కరువు లేదన్నారు. గతంలో కొన్ని కరువు మండలాలు ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. డిపాజిట్ కోల్పోతారనే భయంతో బీజేపీ నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ఆయన మంత్రి కాకాణి ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని చెప్పారు. ఖరీఫ్లో అదనంగా రైతులకు నీళ్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇక, రాజకీయ స్పష్టత లేని పార్టీ ఎదైనా ఉంది అంటే అది జనాసేన పార్టీ అని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కనీసం రాజకీయ అవగాహన లేదన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa