ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతాయి గుర్తుంచుకో: బొండా ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 09:03 PM

మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతాయి గుర్తుంచుకో అంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా హెచ్చరించారు. ఇదిలావుంటే తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చిన వ్యవహారంపై ఆ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఈ అంశంపై బొండా ఉమా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ నీది, రేపు మాది.. గురుపెట్టుకో అంటూ బోండా ఉమా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 


కొబ్బరి చిప్పల నాయకుడు వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా అంటూ బోండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని రకాలుగా తమను అణిచేసే ప్రయత్నం చేసినా తాము తగ్గేది లేద‌న్నారు. రేపట్నుంచి ఇంతకు పదింతలు మాట్లాడతామని వ్యాఖ్యానించారు.


సీఎం జగన్ ఇంటి పునాదులు కదులుతుండటంతో.. టీడీపీ నేతల ఇళ్లను కూలుస్తున్నారని బోండా ఉమా విమ‌ర్శించారు. సీఎం జగన్ పరిపాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని దుయ్యబట్టారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి సీఎం జగన్ ఓర్వలేక.. టీడీపీ నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ఆరోపించారు.


ఆ ఓర్వలేనితనంతోనే టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేశారని బోండా ఉమా మండిప‌డ్డారు. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్చి చంపుతానని జగన్ ఆనాడు కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుట్కా గాడు, కొబ్బరి చిప్పలగాడు మాట్లాడిన మాటలు సంగతేంటంటూ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa