మొన్నటి వరకు కొండెక్కిన నూనే ధరలు కొంచెం కొంచెంగా దిగివస్తున్నాయి. అయితే భారీగా పెరిగిన వంటనూనేల ధరల్లో ఈ తగ్గదల కోసమేర అని చెప్పవచ్చు. దేశంలో అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలలో ఒకటైన అదానీ విల్మార్ వంటనూనెల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కమోడిటీలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో.. వంటనూనెల ధరలను రూ.10 మేర తగ్గిస్తున్నట్టు అదానీ విల్మార్ ప్రకటించింది. అదానీ విల్మార్ విడుదల చేసిన ప్రకటనలో.. పార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ ఎంఆర్పీని రూ.220 నుంచి రూ.210కి తగ్గిస్తున్నట్టు పేర్కొంది. అలాగే ఫార్చ్యూన్ సోయాబీన్, ఫార్చ్యూన్ మస్టర్డ్ ఒక లీటరు ప్యాకెట్ ధరలను రూ.205 నుంచి రూ.195కి తగ్గించినట్టు కంపెనీ పేర్కొంది. కొత్త ధరలతో మార్కెట్లోకి త్వరలోనే ఆయిల్ ప్యాకెట్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం వంటనూనెల ధరలను తగ్గించేందుకు వీటిపై ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించింది. దీంతో ధరలను తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. తగ్గిన ఖర్చులను తాము కస్టమర్లకు బదలాయించాలనుకుంటున్నామని అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ చెప్పారు. తగ్గిన ధరలు డిమాండ్ను కచ్చితంగా పెంచుతాయనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన వంటనూనెలను అత్యధిక సురక్షిత, భద్రతా ప్రమాణాలలో ప్రజలు పొందవచ్చని అన్నారు.
తగ్గిన నూనె గింజల సరఫరా, పెరిగి తయారీ, రవాణా ఖర్చులతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. కమోడిటీలపై ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాలతో, అదానీ విల్మార్, మదర్ డెయిరీ వంటి కంపెనీ కన్జూమర్ ఫోకస్డ్ ప్రొడక్టుల ధరలను తగ్గించాయి.
ఫార్చ్యూన్ అనేది అదానీ విల్మార్కు చెందిన ఫ్లాగ్షిప్ బ్రాండ్. అదేవిధంగా చాలా ప్రీమియం ప్రొడక్టులు, కింగ్స్, ఆధార్, బుల్లెట్, రాగ్, ఆల్ఫా, జూబ్లి, అవసార్, గోల్డెన్ చెఫ్ వంటి ఇతర ఆయిల్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. అదానీ విల్మార్ అనేది అదానీ గ్రూప్కు చెందిన జాయింట్ వెంచర్. ఈ కంపెనీ దేశంలోనే నెంబర్ 1 ఆయిల్ బ్రాండ్ ఫార్చ్యూన్ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 22 ఇన్స్టాలేషన్స్ కలిగి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa