రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న ఇంకా బీజేపీ తన అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. కానీ తమ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో బీజేపీ నిమగ్నమైంది. ప్రస్తుతం బీజేపీకి ఎన్డీయే సభ్యుల మద్దతుతో పాటు ఏదో ఒక పెద్ద పార్టీ మద్దతు కూడా అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తన రాష్ట్రపతి అభ్యర్థి విజయం కోసం వివిధ పార్టీలను అంతర్గతంగా సంప్రదింపులు చేస్తోంది. ఇదిలావుంటే ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడికి ఈ సారి రాష్ట్రపతిగా అవకాశం దక్కేనా అన్న చర్చ సాగుతోంది. వెంకయ్యనాయుడు బీజేపీకి ఎన్నో సేవలు చేశారు. ఈ తరుణంలో ఆయనకు అవకాశముంటుందా అన్నది చర్చాంశనీయంగా మారింది.
ఇదిలావుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలైతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో ఉప రాష్ట్రపతులుగా పనిచేసిన వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, జాకీర్ హుస్సేన్, డాక్టర్ శంకర్దయాళ్శర్మ, కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు. ఆ కోవలోనే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అవుతారా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa