సీఎం జగన్ పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉరవకొండ మండలం మూలగిరిపల్లి గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపిపి చందా చంద్రమ్మ, వైస్ ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి పార్వతమ్మ, సర్పంచ్ శ్రీరాములు, ఎంపీటీసీ ఓబయ్య, ఆమిద్యాల పిఏసీఎస్ చైర్మన్ తేజోనాత్, ఉప సర్పంచ్ వెంకట రెడ్డి ఉరవకొండ పిఏసీఎస్ చైర్మన్ షేక్షావలి, పెన్నహోబిలం చైర్మన్ అశోక్ కుమార్, నాయకులు ఓబన్న,తహశీల్దార్ మునివేలు, ఎంపీడీఓ అమృత రాజు, ఈఓఆర్డీ దామోదర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందిన పథకాలను లబ్ధిదారులకు విశ్వేశ్వరరెడ్డి వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీటిని పరిష్కారం చేయాలని వెంట వచ్చిన అధికారులకు ఆయన ఆదేశించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తమకు జరిగిన మంచికి కృతజ్ఞతగా గడప గడపలో మాజీ ఎమ్మెల్యే తో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి క్షిరాభిషేకం" చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa